ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరొక అరుదైన రికార్డును సృష్టించారు.బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టేసి ఇండియాలో మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ నిలిచారు.“దుఫ్ ఫేలప్స్ సెలబ్రిటీ వాల్యుయేషన్ స్టడీ 2020” లో ఆయన మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా నిలవడంతో నాలుగవ సారి కూడా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నట్లు అయింది.కరోనా వైరస్ నేపథ్యంలో కూడా 2020 సంవత్సరంలో ఆయన బ్రాండ్ వాల్యుయేషన్ సుమారు 237.7 మిలియన్ల డాలర్లు ( రూ.1733.79 కోట్లు) పలకటం నిజంగా షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు.
అయితే రెండవ స్థానంలో ఉన్న మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ అక్షయ్ కుమార్ కంటే విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యుయేషన్ రెట్టింపు ఉంది.అక్షయ్ కుమార్ 118.9 మిలియన్ల డాలర్ల తో (రూ.867.26 కోట్లు) రెండవ స్థానంలో నిలిచారు.ఆయన తర్వాత 102.9 మిలియన్ డాలర్లతో (రూ.750 కోట్లు ) రణవీర్ సింగ్ మూడవ స్థానంలో ఉన్నారు.ఈ జాబితాలోని టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్న క్రికెటర్ లలో విరాట్ కోహ్లీ ఒక్కరే ఉన్నారు.
రోహిత్ శర్మ మాత్రం 17వ స్థానాన్ని దక్కించుకున్నారు.టాప్ టెన్ లిస్టులో విరాట్ కోహ్లీ ఒక్కరే క్రికెటర్ కాగా మిగతా వారందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 51.1 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.దీపిక 5వ స్థానంలో ఉండగా అలియాభట్ 6వ స్థానంలో ఉన్నారు.ఆయుష్మాన్ ఖురానా 7, సల్మాన్ ఖాన్ 8, అమితాబ్ బచ్చన్ 9, హృతిక్ రోషన్ 10వ స్థానంలో నిలిచారు.
ఇకపోతే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగనున్న క్రికెట్ మ్యాచ్ లలో ఆడనున్నారు.కూతురు పుట్టిన సందర్భంగా ఆయన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఆడలేదు.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు ఓ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే.ఆమెకు వామిక అని నామకరణం చేసిన విషయం కూడా తెలిసిందే.