అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కోసం ప్రేక్షకులు ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్నారు.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాతో అఖిల్ ఎలాగైనా బ్లాక్బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమాను బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
అయితే తొలుత ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.కానీ ఇప్పటికే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు మొదలుకొని భారీ బడ్జెట్ చిత్రాల వరకు వేసవి బరిలో రిలీజ్ అవుతుండటంతో బ్యాచ్లర్ కాస్త అయోమయంలో పడ్డాడు.
దీంతో ఈ సినిమా రిలీజ్ను ముందుకైనా, వెనక్కి అయినా జరపాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుండటంతో వేసవి తరవాతే ఈ సినిమాను రిలీజ్ చేయడం బెటర్ అని చిత్ర యూనిట్ నిర్ణయించింది.
దీంతో ఈ సినిమాను జూన్ 19న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు చిత్ర యూనిట్.
అల్ట్రా స్టైలిష్ లుక్తో అఖిల్ ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోండటంతో బ్యాచ్లర్ చిత్రంపై అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.
గతేడాది అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాను GA2 బ్యానర్పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.