ఏపీ లేటెస్ట్ ట్విస్ట్ నిమ్మగడ్డ శాసించారు జగన్ పాటించారు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది.స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం జగన్ సర్కార్ ను కార్నర్ చేసే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

 Nimmagadda Disciplined Jagan Followed, Nimmagadda Ramesh Kumar,ys Jagan, Local E-TeluguStop.com

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో ప్రభుత్వం కూడా నిమ్మగడ్డను ఏం చేయలేని పరిస్థితిలో ఉంది.ఈ క్రమంలో జగన్ సర్కార్ నిమ్మగడ్డ పై కొన్నిసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎదురు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే.

చాలా వరకూ నిమ్మగడ్డ.జగన్ సర్కార్ పై చెయ్యి ఇప్పటివరకు సాధించినట్లు అని చెప్పవచ్చు.ఇటువంటి తరుణంలో గత ఏడాది మార్చిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గుంటూరు చిత్తూరు కలెక్టర్లను మార్చాలని జగన్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు కొంతమంది పోలీసు అధికారులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి ప్రభుత్వానికి ఎస్‌ఈసీ సూచించడం జరిగింది.

గత మార్చి నెలలో నిమ్మగడ్డ సూచించగా ఎట్టకేలకు తాజాగా జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ ఆదేశాలను పాటిస్తూ గుంటూరు కలెక్టర్ గా సర్కార్ వివేక్ యాదవ్ ను నియమించింది.గుంటూరు కలెక్టర్ కోసం ఏపీ ప్రభుత్వం ప్యానెల్ పంపగా, వివేక్ యాదవ్ ను గుంటూర్ కలెక్టర్ గా నియమించేందుకు ఎస్ఈసి ఏకీభవించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube