సానియా మీర్జా పేరు తెలియని భారతీయులు ఉండరు.ఎందుకంటే ఆమె ఒక భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి కనుక.
అయితే సానియా పాకిస్థాన్ కి చెందిన క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే మొదట్లో వీళ్ల పెళ్లి గురించి అభిమానుల దగ్గర నుండి కొంత నిరసన వచ్చినాగాని అవేమి పట్టించుకోకుండా శత్రు దేశం అయిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్ 12న పెళ్లి చేసుకున్నారు.
అలాగే వీరికి 2018లో ఇజ్జాన్ అనే కొడుకు కూడా జన్మించాడు.అయితే సానియా తన లైఫ్ పార్టనర్ కు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మాలిక్ ఇవాళ 40 వ ఏటలోకి అడుగుపెట్టాడు.బర్త్ డే సందర్బంగా తన భర్తకు ఒక కొత్త పద్దతిలో బర్త్ డే విషెస్ చెప్పింది మాలిక్ భార్య సానియా మీర్జా.” ఎవరు లేకపోతే నేను బతకలేనో తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.నీకు రోజులు, నెలలు, ఈ సంవత్సరమంతా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను.
ముఖ్య విషయమేంటంటే నువ్వు ప్రాక్టీస్కు వెళ్లి వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాను.ఇంతకీ అసలు ఇది బర్త్డే విషెస్ అంటావా.? కాదంటావా? ఇదంతా పోనీ కానీ, ఐ లవ్ యూ ” అని రాసి, మాలిక్, సానియా ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఈ పోస్ట్ కు భర్తతో కలిసి దిగిన ఫొటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఇదిలా వుంటే ఈ మధ్యే సానియా కరోన వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని ఆమె స్వయంగా జనవరి 19న సోషల్ మీడియాలో వెల్లడించారు.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కరోనాను అసలు తేలికగా తీసుకోవద్దని చెప్పారు.
అలాగే ఇటీవలే షోయబ్ మాలిక్ ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని బయట పడ్డారు.అతను ప్రయాణిస్తున్న కారు లాహోర్లో ఓ ట్రక్కును ఢీకొట్టింది.అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో మాలిక్ సురక్షితంగా బయటపడ్డారు.అలాగే సానియా ఇజాన్ పుట్టిన తరువాత కొంత బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.
సానియా సుమారు రెండేళ్ల విరామం తర్వాత 2020 లో డబుల్స్ టైటిల్ని గెలిచి తన సత్తాను చాటింది.