యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు.వాటిలో ఒకదాని మించి మరో సినిమా ఉండబోతుంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ని సింగరేణి మైనింగ్స్ లో స్టార్ట్ చేశాడు.ఈ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
మరో వైపు రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాకి సంబందించిన మోషన్ క్యాప్చర్ ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ స్టార్ట్ చేశాడు.ఈ రెండు సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని డార్లింగ్ ప్రభాస్ అనుకుంటున్నాడు.
దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ ఏకంగా 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తున్న సంగతి తెలిసిందే.
నాగ్, అశ్విన్ ప్రభాస్ సినిమాకి సంబంధించి ఒక్కో అప్డేట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు.ముందుగా హీరోయిన్ ని ఖరారు చేసిన దర్శకుడు తరువాత అమితాబచ్చన్ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారని రివీల్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ ని నాగ్ అశ్విన్ రివీల్ చేశాడు.మహానటికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన స్పానిష్ కెమెరామెన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నట్లు వైజయంతి సంస్థ పోస్టర్ను రిలీజ్ను చేసింది.
అలాగే మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఇదిలా ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించడం అతని కెరియర్ కి బెస్ట్ అవుతుందని చెప్పొచ్చు.
ఈ మధ్య కాలంలో మ్యూజిక్ దర్శకుడుగా స్పీడ్ తగ్గించిన మిక్కీ ఒకే సారి ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని పట్టేశాడు.
.