సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి తాప్సి.అయితే ఈ అమ్మడు సౌత్ లో చేసిన సినిమాలతో నటిగా సంతృప్తి చెందకపోవడంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ ఫీమేల్ సెంట్రిక్ కథలు చేస్తూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.
లేడీ ఒరియాంటెడ్ సినిమాలు చేయాలని అనుకునే వారికి ఇప్పుడు బిటౌన్ లో తాప్సి కనిపిస్తుంది.తాప్సి ఒకే అంటే సినిమాకి సగం సక్సెస్ వచ్చినట్లే అనే విధంగా మేకర్స్ కూడా ఉన్నారు.
అలాగే వరుసగా ఈ భామ బయోపిక్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన హవా కొనసాగిస్తుంది.ఇప్పటికే అథ్లెటిక్ జీవిత కథతో తెరకెక్కిన రష్మీ రాకెట్ సినిమా షూటింగ్ పూర్తి చేసేసింది.
ఈ సినిమా కోసం అథ్లెటిక్ కి కావాల్సిన ఫిట్ నెస్ పై దృష్టిపెట్టి రియాలిటీ కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేసి షూటింగ్ లో పాల్గొంది.ఇప్పుడు ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథతో తెరకెక్కుతున్న శభాష్ మిత్ షూటింగ్ కోసం రెడీ అవుతుంది.
ఇక ఇందులో మిథాలీ రాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కోసం తాప్సి గ్రౌండ్ లోకి వచ్చి పూర్తిగా క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది.రియల్ క్రికెట్ ప్లేయర్స్ తో కలిసి నెట్ ప్రాక్టీస్ లో నిమగ్నమైంది.
పాత్రకు జీవం పోసేందుకు ప్రస్తుతం కోచ్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర క్రికెట్ లో శిక్షణ పొందుతుంది.ప్రాక్టీస్ సెషన్ కు సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో తాప్సి తన ట్విటర్లో షేర్ చేసింది.
త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని చెప్పింది.బ్యాట్, బాల్తో రొమాన్స్ చేయనున్నాను అని రాసుకొచ్చింది.ఈ సినిమాకు రాహెల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
.