మొదటి దఫా పాలన నుండి ప్రస్తుత రెండో దఫా పాలన వరకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రజారంజక పథకాలతో ముందుకెళ్తోంది.కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఇంకా మరెన్నో పథకాలు ప్రజలలో కేసీఆర్ కు మంచి పేరును తీసుకొచ్చాయి.
కేసీఆర్ ను మరల అధికారంలోకి తీసుకురావడంలో ఈ పథకాల పాత్ర ఎంతో కీలకమైనదిగా చెప్పవచ్చు.ఇలా పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరొక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టాలనే యోచిస్తోంది.
మహిళల ఉపాధి కల్పించడానికి చేపలు, చేపల వంటకాలను విక్రయించుకోవడానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేయనుంది.నేరుగా వినియోగదారుడి వద్దకే ఫిష్ ఔట్ లెట్ వాహనాలు చేరడం ద్వారా మహిళలకు ఉపాధి కలుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఈ రంగంలో ఆసక్తి ఉన్న మహిళలకు ఫిష్ ఔట్ లెట్ వాహనాలను మంజూరు చేసి మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.మరి ఈ పథకం పనితీరు వివరాలను త్వరలో ప్రభుత్వం వివరించనుంది.
మహిళలకు సంబంధించిన పథకం కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఈ పథకాన్ని ప్రవేశపెడుతుందా లేదా ఏదైనా వేరే ప్రణాళిక ఉందా అనేది చూడాల్సి ఉంది.