టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ ప్రియమణి తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన అందంతో అభిమానుల మనసులు దోచుకుంది.
మొదట్లో అచ్చమైన తెలుగు అమ్మాయిల కనిపించిన ప్రియమణి రాను రాను తన అందాన్ని పెంచుకుంటూ గ్లామర్ బ్యూటీ గా తయారయింది.కాగా గత కొద్దికాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి ప్రస్తుతం అడుగు పెడుతూ డిమాండ్ చేస్తుంది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీకి ఈ సినిమా ద్వారా విజయం అందుకోలేకపోయింది.ఈ క్రమంలో తమిళం పై దృష్టి పెట్టగా తిరిగి తెలుగులో జగపతి బాబు తో “పెళ్లయిన కొత్తలో” సినిమా లో నటించింది.
కాగా ఈ సినిమా ప్రియమణికి మంచి విజయాన్ని అందించింది.తమిళ్, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది.
ప్రియమణి తన పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండగా ప్రస్తుతం మళ్లీ అడుగు పెట్టింది.తమిళ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రలో వస్తున్న సినిమా “తలైవి”.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇందులో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ప్రియమణి తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ క్రమంలో ప్రియమణి మాట్లాడుతూ.“సినిమాలో కథను డిమాండ్ చేస్తే.దానికి తగ్గట్టుగా ఎక్స్ పోజింగ్ తరహాలో గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని” తెలిపింది.
ఇదిలా ఉంటే తను షేర్ చేసిన ఫోటోలు పూర్తిస్థాయిలో శరీరాకృతిని మార్చుకొని గ్లామర్ లుక్ తో కనిపించింది.కథకు తగ్గట్టు గ్లామర్ ను అందిస్తానని తెలిపింది.