ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే..!!

మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల రైల్వే శాఖ ఎక్కువగా రైలు తిప్పటం లేదన్న సంగతి తెలిసిందే.చాలా రైళ్లను ప్రభుత్వం రద్దు చేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Vishakapatanam,secunderabad,corona Virus,lock Down, Good News For Railway Passen-TeluguStop.com

అన్ లాక్ అనంతరం స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న అవి పెద్దగా ప్రయాణికుల అవసరాలను తీర్చలేని పరిస్థితి.ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఓ కీలకమైన ప్రకటన చేయడం జరిగింది.

తెలుగు రాష్ట్రాలలో మరి కొన్ని ప్రత్యేకమైన రైళ్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ to ముంబై ఎల్టిటి రైలు ఈనెల 26 నుంచి ప్రతి మంగళవారం మరియు శుక్రవారాల్లో నడపనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా కాచిగూడ to చిత్తూరు ట్రైన్ ఈనెల 27 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇదే క్రమంలో సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం రైలు ను ఈ నెల 27వ తేదీ ప్రతి సోమ మరియు బుధ, శనివారాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఇదిలావుంటే ఇటీవల సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పది ప్రత్యేకమైన ట్రైన్ లను స్పెషల్ ట్రైన్ లుగా మార్చి వాటినే కంటిన్యూ చేయాలని నిర్ణయించారు.మరోపక్క మరి కొన్ని ప్రత్యేకమైన రైళ్లను తీసుకురావాలని పెంచాలని ప్రయాణీకులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube