మంచివారికే కష్టాలు వస్తాయి అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం.కానీ అది నిజమే అనిపిస్తుంది సోనూసుద్ను చూస్తుంటే.
కరోనా కష్టకాలంలో ఎందరికో దేవుడై ప్రతి కష్టాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఆదుకొన్న మనిషి సోనూసూద్ అని ప్రతి వారు ఒప్పుకోక తప్పదు.
అప్పటి వరకు సినిమాలో విలన్గా ఉన్న సోనూసూద్ ఒక్క సారిగా ప్రజల గుండెల్లో స్దానం సంపాదించాడు.
గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నాడు.అక్రమంగా డబ్బులు సంపాధించే వారు కూడా ఇంతలా సహాయ సహకారాలు అందించలేదు.
అలాంటిది ఈ బాలీవుడ్ విలన్ ఎన్నో కోట్లు ఖర్చుచేశాడు.ఇలాంటి ఆయనకు ఓ విషయంలో ఎదురుదెబ్బలు తప్పడం లేదట.
అదేమంటే ముంబైలోని సబర్బన్ జుహులోని ఓ నివాస భవనాన్ని సోనూసూద్ గతేడాది అక్టోబర్లో హోటల్గా మార్చాడు.అయితే దీనిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులు జారీ చేసింది.బీఎంసీ జారీ చేసిన నోటీసును రద్దు చేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సోనుసూద్ తన పిటిషన్లో కోర్టును కోరారు.కాగా, బీఎంసీ జారీ చేసిన నోటీస్ను సవాల్ చేస్తూ సోనుసూద్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం బాంబే హైకోర్టు కొట్టివేసిందట.
ఇక ఈ విషయం తెలిసిన సోనూసూద్ అభిమానులు నిరాశతో ఆ కోర్టు పై, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారిపై గుర్రుగా ఉన్నారట.