ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి.ఒక పక్క సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బేటీ కావటం మరోపక్క టీడీపీ పార్టీకి చెందిన నాయకులు అరెస్ట్ కావడం సంచలనాలకు దారి తీస్తుంది.
పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల శ్రీకాకుళం జిల్లా లో హై టెన్షన్ పరిస్థితి నెలకొంది.
టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వాహనంపై చెప్పులు విసరడంతో.వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా రాజాంలోని కళా వెంకట్రావు కార్యాలయానికి 300 మంది పోలీసులు చేరుకుని అరెస్టు చేశారు.విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పులు విసిరిన ఘటనలో ఒక కళా వెంకట్రావు మాత్రమే కాక ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో వారిని కూడా అరెస్టు చేసి నెల్లిమర్ల పీఎస్కు తరలించడం జరిగింది.
కాగా గురువారం ఉదయం బెయిల్ రావడంతో ఆయన విడుదల అవ్వడం జరిగింది.మరోపక్క కళా వెంకట్రావు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి
.