ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకులు రోజుకొకరు కొత్తవారు దర్శనమిస్తున్నారు.అయితే ఇలా ఎంతమంది వచ్చినా కేవలం కంటెంట్ ఉన్న వాడికి మాత్రమే స్థానం అన్నట్లు చాలా కొద్దిమంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించగలుగుతారు.
ఇందులో భాగంగానే కేవలం అతి తక్కువ సమయంలోనే కుర్రకారులకు నచ్చే పాటలను కంపోజ్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు యువ సంగీత దర్శకుడు థమన్.తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలకు పని చేసి శభాష్ అనిపించుకున్న వ్యక్తిగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ దూసుకెళ్తున్నాడు.ఇదివరకు పాత ట్యూన్స్లను కాపీ కొడుతున్నారు అన్న భావన నుంచి ఇప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. 2020 సంవత్సరంలో విడుదలైన అలా వైకుంఠపురం సినిమా కి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.అలాగే 2021 సంవత్సరంలో కూడా అదే ఫామ్ కొనసాగించాలని థమన్ అనుకుంటున్నాడు.ఇంతకు తగ్గట్టుగానే 2021 మొదలైన మొదటి నెలలోనే క్రాక్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అంతేకాదు తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకున్నాడు.మెగాస్టార్ చేయబోయే రీమేక్ సినిమా లూసిఫర్ కు తమన్ సంగీతాన్ని అందించబోతున్నారు.ఇందుకు సంబంధించి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ చేశారు.
దింతో థమన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.థమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చిరంజీవి ఫోటోను పోస్ట్ చేస్తూ.ఏ సంగీత దర్శకుడు అయిన అతి పెద్ద కల, నా కల నిజమవుతున్న వేళ.అంటూ మన బాస్ మెగాస్టార్, ప్రియమైన సోదరుడు మోహన్ రాజాపై ప్రేమను చూపించే సమయం అంటూ పోస్ట్ చేశాడు.థమన్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో లూసిఫర్ సినిమా త్వరలో తెరకెక్కబోతున్న విషయం ఇప్పుడు మెగాస్టార్ అభిమానులకు ఆనందాన్ని కలగజేసే విషయంగా మారిపోయింది.