సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనిషికి స్వేచ్ఛ పెరిగింది.అదేవిధంగా ఫేస్బుక్ మరియు ట్విట్టర్ దుర్వినియోగం కూడా పెరిగింది.
ఈ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ దుర్వినియోగంపై సమన్లు జారీ చేసిన ప్రభుత్వం ఈనెల 21న తమ ముందు హాజరు కావాలని ఐటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపించింది.సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశాలపై మాట్లాడటానికి ఆ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
డిజిటల్ రంగంలో పౌర హక్కుల రక్షణ సోషల్ మీడియా తో పాటు ప్రధాన మీడియా లో ముఖ్యంగా మహిళల భద్రత విషయంపై సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
సోషల్ మీడియా ద్వారా వచ్చిన కొన్ని యాప్స్ తరువాత మనిషికి స్వేచ్ఛ పెరిగింది కానీ కచ్చితమైన సమాచారం పై నమ్మకం తగ్గింది.సోషల్ మీడియాలో పొంగిపొర్లే ఫేక్ న్యూస్ ని కూడా ప్రజలు నమ్మకుండా చేస్తుంది.విద్వేషాలను రెచ్చగొట్టడంలో అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా పాత్ర పూర్తిగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే పౌరహక్కుల సంస్థలకు పేస్బుక్ మధ్య వార్ కు తెర లేచింది.ఫేక్ న్యూస్ కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాకు చెందిన పౌరహక్కుల సంస్థలతో పాటు ఆంటీ డిప్రమేషన్ లీగ్ అనే సంస్థలు స్టాప్ హేట్ ఫర్ పాపిట్ క్యాంపియన్ ను మొదలుపెట్టాయి.క్యాంపియన్ మొదలు అయినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 160 సంస్థలు సోషల్ మీడియా నుంచి తన ప్రకటనలు వెనక్కు తీసుకున్నాయి.
స్టాప్ హేట్ ఫర్ పాపిట్ క్యాంపియన్ ప్రభావం ఫేస్ బుక్ మీద చాలా స్పష్టంగా కనిపించింది.దీంతో ఊహించని విధంగా పడిపోయిన ఫేస్బుక్ షేర్ విలువ.
రెండు రోజుల్లోనే ఫేస్బుక్ 60 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టపోయారు.
ఇటీవల సోషల్ మీడియా సంస్థల పై కొన్ని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ఒక పార్టీకి కొందరు నాయకులు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.ఈ విషయంపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదం నడిచిన విషయం అందరికీ తెలిసినదే.
మొత్తంగా చూసుకుంటే సోషల్ మీడియా దుర్వినియోగం పై కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేస్తూ ఈనెల 21వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది.లేదా కొత్త నిబంధనలు ఏర్పాటు చేసి వాటిని పాటించే విధంగా నిర్ణయం తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం.
.