ఒక సోషల్ మీడియా వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోయాయి.అలాంటి ఘటన ప్రస్తుతం జరిగింది.
కర్ణాటకలోని ఇలాంటి సంఘటన అక్కడ ప్రజలకు కలకలం రేపుతోంది.ఒకే ప్రాంతానికి చెందిన యువకులు అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని కత్తితో పొడిచి చంపిన దారుణమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగింది.వాట్సాప్ వల్ల ఒక వ్యక్తి ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు.
ఫోటోలో వ్యవహారం ఒక దళిత యువకుడు ప్రాణాలు దారితీసింది.వాట్సాప్ లో తమ ఫోటోలు పెట్టాడు అన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వ్యక్తులు.
ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురం లో ఆదివారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటకలోని యశవంతపురం లోని ఆంధ్రహల్లి కి చెందిన శీనా అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తులు అభి ప్రవీణ, మనోజ్ అరే యువకుల ఫోటోలను తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు.
దీంతో ఆ ఇద్దరు యువకులు శీనా ఇంటికి వెళ్లి అతనిని కత్తితో పొడిచి పరారయ్యారు.దీనితో తీవ్ర గాయాలు అయిన శీనా అస్వస్థతకు గురై అక్కడికక్కడే మరణించాడు.
కాగా హతుడు దళిత సంఘం లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.ఈ విషయం తెలిసిన రాజ గోపాల్ నగర్ కు చెందిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
.