ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న సినిమాకు అదిలోనే అంటకం ఎదురైంది.ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతుందని గతంలో చిత్ర యూనిట్ పెర్కొంది అయితే ఇప్పుడు ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో సందిగ్ధంలో పడ్డ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విషయంపై మరో ఆలోచన చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ను మరికొన్ని రోజులు వాయిదా వేయాలి భావిస్తు్న్నాడు. దీపిక ప్రస్తుతం ఈ మూవీ చేయకపోవడానికి బలమైన కారణం ఉంది.ప్రభాస్ సినిమాకు డెట్స్ ఇస్తే తన అంతకుముందు ఒప్పుకున్న హృతిక్ ఫైటర్ చిత్రం షూటింగ్లో పాల్గోనడం ఇబ్బంది అవుతుందని భావించిందట.
అందుకే ప్రభాస్ మూవీకి నో చెప్పిందని తెలుస్తో్ంది.దీంతో ఎలాగైన దీపికనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాలనే పట్టుదలతో ఉన్న నాగ్ ఆశ్విన్.ఆమెకు డెట్స్ ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నడంటా.
ఈ సినిమాలోని పాత్రకు దీపికా తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా నమ్ముతున్న నాగ్ అశ్విన్ ఆమె కోసం ఇంతగా వెయిట్ చేస్తున్నాడు.ఈ మధ్య దీపికను కలిసిన ఆశ్విన్ ఈ ఏడాది చివరికైనా డేట్లను అడ్జెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నించాలని ఆమెకు చెప్పాడట.దీంతో అతని నిర్ణయానికి సానుకూలంగా స్పందించిన దీపికా అందుకు ఓకే చెప్పినట్లు టాక్.
దీంతో ఆశ్విన్, ప్రభాస్ మూవీ మరికొన్ని రోజులు వాయిదా పడనుంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనుంది.
అలాగే ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా నటించనున్నారు.మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు.
టాలీవుడ్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న సలార్ సినిమా శుక్రవారం లాంచ్ అయింది.
ఇక పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి.