ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా ప్రజల్లోకి వెళ్తోంది.టీఆర్ఎస్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యచరణపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే విధంగా ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
కాని ఇక్కడ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే క్షేత్ర స్థాయి క్యాడర్ నిర్మాణానికి సన్నాహాలు కూడా ప్రారంభిస్తోంది.ప్రస్తుతం పెద్ద ఎత్తున కార్యకర్తల నిర్మాణం జరుగుతున్న ప్రస్తుత దశలో కార్యకర్తలకు ఏదైనా సమస్య జరిగినా ఇతర రాష్ట్ర స్థాయి నేతలు హాజరుకాకుండా స్వయంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలను పరామర్శించి ధైర్యం చెబుతూ జరిగిన ఘటనను రాష్ట్ర స్థాయిలో చిత్రీకరిస్తూ టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. అసలు వ్యూహం ఏమనగా ప్రస్తుత కార్యకర్తల నిర్మాణం జరుగుతున్న పరిస్థితులలో కార్యకర్తలకు ఇబ్బంది జరిగితే స్వయంగా అధ్యక్షుడే హాజరవడం వల్ల కార్యకర్తలలో మనోబలం పెరిగి, తమకు ఏమైనా జరిగితే రక్షించడానికి అధ్యక్షులు ఉన్నారన్న భరోసా కార్యకర్తలకు కలిగి ఇక ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడే అవకాశం ఉంది.ప్రస్తుత దశలో కార్యకర్తలు బలంగా లేకపోతే భవిష్యత్తులో ముందుకు వెళ్ళే అవకాశం లేదు.
అందుకే బండి సంజయ్ ప్రతి ఘటనలో హాజరై కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.