విజయ నగరం జిల్లా రామ తీర్థంలో వారం రోజుల క్రిందట కొంత మంది దుండగులు శ్రీ రాముడి విగ్రహంను ద్వంసం చేశారు.ఈ ఘటనపై రాష్ట్ర స్థాయిలో పెద్ద దుమారం రేగుతుంది.
అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అందుకు నిరసన తెలుపుతూ నేడు బీజేపీ, జనసేన పార్టీ నాయకులు రామ తీర్థం ధర్మ యాత్రను చెయ్యడానికి సిద్దం అవ్వుతుండగా రాష్ట్ర పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనతో పాటుగా ఆ పార్టీకి చెందిన నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రామతీర్థం ధర్మ యాత్రలో పాల్గొంటాడ లేదా అనేది తెలియాలిసి ఉంది.
ఇప్పటికే పోలీసులు కొంత మంది బిజేపి నేతలను గృహ నిర్బంధం చేశారు.గుంటూరు లో కన్నా లక్ష్మి నారాయణను ఆయన నివాసంలో గృహా నిర్బంధం చేశారు.