ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరం ను పూర్తి చేసుకొని వీడ్కోలు అందించి 2021 సంవత్సరం ను ఘనంగా వేడుకలు జరుపుకుంటూ ఆహ్వానించారు.కాగా పలు చోట్ల అంగరంగ వైభవంగా వేడుకలు జరుగగా పలుచోట్ల దాడులు జరిగాయి.
ఓ చోట మహిళలపై విసిరిన పంచె వల్ల 13 మందికి గాయాలు జరిగిన ఘటన చోటు చేసుకుంది.
కడప నగరంలోని మరియాపురం లో న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న అంగరంగ వైభవంగా వేడుకలకు సిద్ధమయ్యారు.
కొన్ని వేడుకలను నిర్వహించగా అందులో చెక్క భజన చేసే కార్యక్రమం ఏర్పాటు చేసారు.కాగా వేడుక జరుపుతున్న ఓ వ్యక్తి చెక్క భజన చేస్తూ తను కట్టుకున్న పంచె ను ప్రేక్షకుల మీదకి వదిలేశాడు.
దీంతో ఆ పంచె ఓ మహిళ పై పడగా ఆ మహిళ ఆ వ్యక్తిని నిలదీసింది.ఈ క్రమంలో వాళ్ళ మధ్య గొడవ పెద్దది కాగా ఆ వ్యక్తి ఆమెను కొట్టాడు.
ఈ సంఘటన కడప పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.కాగా పోలీసులు వారి ఇరువురిని కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేశారు.
ఆ ఇరువురు సంబంధితులు తిరిగి ఇంటి వచ్చినా తరువాత వాళ్ళ మధ్య మళ్లీ గొడవ దారుణంగా జరిగింది.ఈ క్రమంలో కత్తులు, గొడ్డళ్లు,కట్టెలతో చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి తీవ్రమైన విషాదాన్ని నింపింది.
ఇందులో ఒక వైపు వాళ్ళు ఏడుగురు గాయపడగా.మరోవైపు వాళ్ళు ఆరుగురు గాయపడ్డారు.
దీంతో గాయపడిన వ్యక్తులను వెంటనే చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రి కు తరలించారు.వాళ్ళకు చికిత్స అందించగా మరో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా మారింది.
కాగా ఇందులో మనోజ్ అనే వ్యక్తి 12 మంది పై హత్యాయత్నం కేసు అందించాగా.మరోవైపు అగస్టీన్ అనే వ్యక్తి 11 మంది పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.