కరోనా వైరస్ కారణంగా సామాజిక దూరానికి ప్రజలు అలవాటు పడుతున్నారు.షేక్ హ్యాండ్ ఇచ్చేందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు జనం.
కానీ కరోనాను లెక్కచేయని కొందరు మాత్రం హద్దులు దాటి మరి ప్రవర్తిస్తున్నారు.అయితే రోగులకు నిత్యం సేవలు చేస్తూ తమ బాధ్యతలు నిర్వహించే నర్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే ఓ నర్సు మాత్రం తన కామకోరికను తీర్చుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం.
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాయి.
కాగా ఇండోనేషియా రాజధాని జకార్తలో విస్మా అట్లెట్ క్వారంటైన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు కామంతో కళ్లు మూసుకుపోయి ఓ కరోనా రోగితో ఏకంగా శృంగారంలో పాల్గొంది.తనకు ఇచ్చిన పీపీఈ కిట్ను పక్కనపడేసి కరోనా సోకిన రోగితో కామకేళిలో మునిగితేలింది.
దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే ఆమెతో పాటు ఆ కరోనా రోగిని ఆసుపత్రికి తరలించారు.వారిద్దరినీ అధికారులు క్వారంటైన్లో ఉంచారు.
అయితే ఈ పాడుపనికి పాల్పడిన ఆ నర్సుకు కరోనా టెస్టు చేయగా ఆమెకు నెగెటివ్ వచ్చిందని తేలింది.
దీంతో సదరు నర్సు చేసిన నిర్వాకంపై అధికారులు మండిపడటమే కాకుండా ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు.
కరోనా నిబంధనలను ఇలా ఉల్లంఘించినందుకు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.ఏదేమైనా కామంతో కక్కుర్తి పడ్డ ఆ నర్సుకు శిక్ష పడటమే కాకుండా ఆమెకు సహకరించిన కరోనా రోగికి కూడా అధికారులు శిక్ష విధించారు.
కరోనా విజృంభిస్తున్న వేళ ఇలాంటి పాడుపని చేయాలని ఆ నర్సుకు ఎందుకు అనిపించిందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.