ఏ రంగంలో అయిన పోటీ అనేది ఉంటుంది.అది కామన్.
సినిమా రంగంలో కుడా అంతే.అయితే ఇప్పుడు బుల్లితెర యాంకర్స్ కూడా నేను తోపు.
అంటే నేను తోపు అనుకుని నానా హంగామా చేస్తున్నారు.ఇంతకీ ఆ యాంకర్స్ ఎవరు అని అనుకుంటున్నారు.? వాళ్ళు మరెవరో కాదు.జబర్దస్త్ షో యాంకర్స్ అయిన అనసూయ, రష్మి.
వీళ్ళద్దరికి అప్పట్లో ఏవో గొడవలు ఉన్నాయని ప్రచారం జోరుగానే సాగింది.అయితే అదంతా ట్రాష్, మా ఇద్దరి మధ్య అలాంటి గొడవలు ఏమి లేవు అని ఇద్దరూ కొట్టి పడేసారు.
ఇద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ చెప్పారు రష్మి, అనసూయ. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ ఎవరు అనే ప్రశ్న వస్తే మొదటి వరసలో సుమ కనకాల, ఆ తరువాత స్థానంలో అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ ఉంటారు.
ఒకవిధంగా చెప్పాలంటే ఈ ఇద్దరికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ షో అనే చెప్పాలి.ఆ షో వల్లే ఈ ఇద్దరూ భామలు పాపులర్ అయ్యారు.
ఈ షో రాకముందు ఇద్దరూ ఒకేసారి కెరీర్ మొదలు పెట్టారు.చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చారు.
గుర్తు కూడా పట్టలేని పాత్రల్లో నటించారు అనసూయ, రష్మి గౌతమ్.
ఆ తర్వాత జబర్దస్త్ షో వీళ్ళకు యాంకర్స్ గా చేసే అవకాశం కల్పించింది.
యాంకర్ గా మొదలు పెట్టిన వీళ్ళ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఒక్కో షోకు లక్షలకు లక్షలు తీసుకుంటూ టాప్ రేంజ్కు ఎదిగిపోయారు.అనసూయ అయితే సినిమాల్లో కూడా నటిస్తూ తెగ బిజీ అయిపొయింది.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు యాంకర్స్ స్టేజీ ముందు అందరూ చూస్తుండగానే గొడవ పడ్డారు.నువ్వా… నేనా.సై అంటూ రచ్చ రచ్చ చేసారు.
నిజంగా కాదాందోయ్.కొత్త సంవత్సరం రాబోతుంది కదా.అందుకనే ఈటీవీ న్యూ ఇయర్ ఈవెంట్ లో భాగంగా డిజే అనే కార్యక్రమం చేస్తుంది.అందులో అనసూయ, రష్మి గౌతమ్ కూడా పాల్గొన్నారు.
వాళ్లిద్దరూ స్టేజీపైకి రాగానే ఒకరిపై ఒకరు తమ దైన శైలిలో పంచులు వేసుకుంటూన్నారు.ఇదంతా రోజా చూస్తుండగానే జరుగుతుంది.
రష్మి స్టేజీ మర్యాదగా ఇస్తే మంచిది అంటూ అనసూయకు వార్నింగ్ ఇస్తుంది.ఆ డైలాగ్ విన్న అనసూయ.
ఇవ్వకపోతే ఏంటి అని.? అడిగితే లాగేసుకుంటా అని రష్మీ కి కౌంటర్ ఇస్తుంది అనసూయ.దానికి ఇదేమైనా యాంకరింగ్ కుర్చీనా లాక్కోడానికి అంటూ పంచ్ వేసింది రష్మి.ముందు నువ్వే లాక్కున్నావ్ అంటూ ఇద్దరూ మాట మాట అనేసుకుంటారు.
ఇది చుసిన అందరు నిజంగానే గొడవ పడుతున్నారా అనుకుంటారు.కానీ ఇది స్కిట్ ప్రోమోలో భాగమే.రష్మి, అనసూయ మధ్యలో సుడిగాలి సుధీర్ కూడా నలిగిపోతున్నట్లు కనిపిస్తాడు.ఈటీవీ లో ప్రసారమయిన ఈ న్యూ ఇయర్ డిజే ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
ముఖ్యంగా అనసూయ vs రష్మీ గొడవ తెగ ఫేమస్ అయింది అని చెప్పాలి.