ఆ రెండు పార్టీలను ఆలయాల దరిదాపులోకి రానివ్వద్దు :విష్ణు వర్ధన్ రెడ్డి

దేవాలయాల విషయంలో టి‌డి‌పి, వైసీపీ పార్టీలు తప్పుడు ప్రమాణాలు చేస్తున్నాయని బి‌జే‌పి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశాడు.గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలను కూల్చివేస్తే.

 Bjp Leader Vishnu Vardhan Reddy Comments On Tdp And Ysrcp Leaders, Vishnu Vardha-TeluguStop.com

ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మాత్రం, ఆలయాల రథాలు తగలుబడుతున్న పట్టించుకోలేదని అన్నాడు.చంద్రబాబు హయాంలో దోచుకున్న నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు, ఒక్కరి తర్వాత ఒక్కరు దోచుకుని అలసిపోయారని అన్నారు.

ఈ విషయంపై ప్రతి దానికి ప్రమాణం అంటూ సిద్దం అవ్వుతున్నారని అన్నాడు.

టి‌డి‌పి వైసీపీ నేతలు దేవాలయాలలోకి వస్తే మలిన పడుతాయని.

అలాంటి వాళ్ళను దగ్గరకు రానివ్వొద్దని.ఒకవేళ వచ్చిన వారు వెళ్ళిన తర్వాత పసుపు నీళ్ళతో శుభ్రం చెయ్యాలని అన్నాడు.

రాష్టా ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని అందుకే బి‌జే‌పి వైపు చూస్తున్నారని అన్నాడు.రాబోయే ఎన్నికల్లో ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన అధికారంలోకి రావడం ఖాయం అని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube