సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ టాక్ షోకు మెగాస్టార్ చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే.చిరంజీవి హాజరైన ఎపిసోడ్ నేడు ప్రసారం కాగా చిరంజీవి ఈ షోలో తన లైఫ్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను చిరంజీవి పంచుకున్నారు.1980 సంవత్సరంలో విడుదలైన శంకరాభరణం సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ ఆ సినిమా చూసిన తరువాత తనకు కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు.
శంకరాభరణం సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మంజు భార్గవి, తాను కోతలరాయుడు అనే సినిమాలో కలిసి నటించామని ఆమె శంకరాభరణం ప్రీమియర్ కు ఆహ్వానించడంతో తాను వెళ్లానని తెలిపారు.
ప్రీమియర్ షోకు అల్లు రామలింగయ్య కుటుంబం వచ్చారని ప్రీమియర్ షోకు వచ్చిన వాళ్లలో సురేఖ కూడా ఉన్నారని చెప్పారు.థియేటర్ లో తాను, మంజు భార్గవి పక్కపక్కనే కూర్చున్నామని తాను ఏడుస్తుంటే కన్నీళ్లు తుడుచుకోవడానికి మంజు భార్గవి చీర కొంగును ఇచ్చారని అన్నారు.
అయితే చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకునే సమయంలో థియేటర్లలో లైట్స్ ఆన్ అయ్యాయని.ఆ సమయంలో తన చేతిలో మంజు భార్గవి చీర కొంగు ఉండటంతో థియేటర్ లో ఉన్నవాళ్లు తన గురించి ఏమనుకున్నారో అని అనిపించిందని తెలిపారు.ఆ తరువాత తనకు, సురేఖకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు అనుకున్న సమయంలో సురేఖ పెళ్లికి నో చెబుతుందని అనుకున్నానని చెప్పారు.
శంకరాభరణం సినిమా ప్రీమియర్ సమయంలో తాను చీరకొంగు పట్టుకుని ఉండటం చూసి ఉండవచ్చని.
తనను పెళ్లి చేసుకోదని అనుకున్నా సురేఖ పెళ్లికి అంగీకరించిందని వెల్లడించారు.శంకరాభరణం సినిమా తరువాత వేట సినిమా చూసిన ఫ్లాప్ అయిన సందర్భంలో తాను బాధ పడ్డానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
సమంత అడిగిన ప్రశ్నలన్నింటికీ చిరంజీవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.