జనవరి 10 నుంచి మణిరత్నం పాన్ ఇండియా సినిమా సెట్స్ పైకి

సౌత్ ఇండియా దర్శక దిగ్గజం మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా భారీ క్యాస్టింగ్ తో పాన్ ఇండియా మూవీగా పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఐశ్వర రాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాజేష్, త్రిష లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.

 Mani Ratnam To Resume Ponniyin Selvan Shoot From January 10, Tollywood, Kollywo-TeluguStop.com

ఈ నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు మొదలుకొని ఉన్నాయి.చోళుల కాలం నాటి కథతో ఈ సినిమా ఉండబోతుంది.

ఇక ఐశ్వర్య రాయ్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న మహారాణి పాత్రలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే కోలీవుడ్ నుంచి వస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీగా దీనికి మంచి ప్రచారం కూడా ఉంది.

లాక్ డౌన్ కి ముందే ఈ సినిమాని మణిరత్నం స్టార్ట్ చేశారు.అయితే కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.

ఇదిలా ఉంటే మరల లాక్ డౌన్ సడలింపులు తర్వాత తర్వాత సినిమా షూటింగ్ లు యధాప్రకారం జరుగుతున్నాయి.ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు షూటింగ్స్ జరుగుతున్నాయి.

ఈ నేపధ్యం మణిరత్నం కూడా పొన్నియన్ షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేసేశారు.జనవరి 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు.చోళుల కాలం నాటి వాతావరణం ఎలివేట్ అయ్యే విధంగా ఆర్కిటెక్స్ చేస్తున్నారు.

వీటిలోని మెజారిటీ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.చియాన్ విక్రమ్ ఈ ప్రాజెక్ట్ తో పాటు మహావీర్ కర్ణ సినిమాని కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube