నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ ని పట్టాలు ఎక్కించడానికి రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేశాడు.ఈ సినిమాలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి షెట్టు, మడోన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కూడా నాని మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు నాని డిజిటల్ ఎంట్రీకి రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా స్టార్స్ చాలా మంది డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో వెబ్ సిరీస్ లు చేయడానికి రెడీ అయ్యారు.ఇప్పటికే హీరోయిన్లు డిజిటల్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ డిజిటల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.భవిష్యత్తులో సినిమా ఎక్కువగా డిజిటల్ వరల్డ్ లోనే వస్తుంది.
ఈ నేపధ్యంలో స్టార్స్ అందరూ డిజిటల్ లో వెబ్ సిరీస్ లు, మూవీలని చేయడానికి రెడీ అవుతున్నారు.అయితే డిజిటల్ వరల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ వర్క్ అవుట్ కాదు కాబట్టి కొత్తదనం ఉన్న కథల కోసం చూస్తున్నారు.ఈ నేపధ్యంలో గత కొంత కాలంలో నెట్ ఫ్లిక్స్ ఛానల్ నానితో ఓ వెబ్ మూవీ కోసం సంప్రదింపులు జరుగుతుందని టాక్ వినిపిస్తుంది.ఇక వెబ్ మూవీ కాన్సెప్ట్ నచ్చడంతో పాటు రెమ్యునరేషన్ కూడా బాగా ఇవ్వడంతో చేయడానికి నాని ఒకే చెప్పాడని సమాచారం.
శ్యామ్ సింగరాయ్ తర్వాత ఈ వెబ్ ఫిలిం స్టార్ట్ అవుతుందని బోగట్టా.
తాజా వార్తలు