టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో వరుణ్ తేజ్ ముందువరసలో ఉంటారు.ముకుంద సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన వరుణ్ తేజ్ కంచె, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మిడిల్ రేంజ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
నిన్న నిహారిక చైతన్యల పెళ్లి జరగడంతో త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరగబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వరుణ్ తేజ్ పెళ్లి గురించి వార్తలు వైరల్ కావడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఒక టాలీవుడ్ హీరోయిన్ తో వరుణ్ పెళ్లి అంటూ వార్తలు వైరల్ కావడం కావడం గమనార్హం.
కరోనా విజృంభణ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానితుల మధ్య నిహారిక చైతన్యల వివాహం ఉదయ్ పూర్ లో జరిగింది.ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ హీరోయిన్లైన లావణ్య త్రిపాటి, రీతూవర్మలకు ఆహ్వానాలు అందాయి.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించారు.
ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ లుగా మిగిలినా వరుణ్ తేజ్ లావణ్యల జోడీకి మంచి మార్కులు పడ్డాయి.గతంలో వరుణ్ లావణ్య లవ్ ట్రాక్ కు సంబంధించి వార్తలు రాగా మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకకు లావణ్యకు ఆహ్వానం అందడంతో లావణ్య త్వరలో మెగా కోడలు అవుతుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.లావణ్య స్పెషల్ ఇన్విటేషన్ దక్కడానికి వరుణ్ తేజ్ కారణమని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే మెగా ఫ్యామిలీ సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని లావణ్య, రీతూవర్మ నిహారికకు ఫ్రెండ్స్ కావడంతో పాటు కలిసి ఒకే జిమ్ లో వర్కౌట్లు చేస్తారని అందుకే వాళ్లకు ఆహ్వానం అందిందని చెబుతున్నారు.వరుణ్ లావణ్యల గురించి జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.