వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ ‘మర్డర్‘.మిర్యాలగూడెం పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమాను వర్మ తీసిన సంగతి అందరికి తెల్సిందే.
రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో అమృత ను విలన్ గా చూపించడంతో పాటు ఆమె తండ్రి చేసింది పెద్ద తప్పేం కాదు.కూతురుపై ప్రేమతో అతడు అలా చేశాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా విభిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఆయన ప్రతి సినిమా కూడా ఈమద్య కాలంలో వివాదాస్పదం అవుతుంది.
మర్డర్ సినిమా ను కూడా అమృత వ్యతిరేకించింది.తాను మర్చి పోతున్న విషయాన్ని మళ్లీ గుర్తు చేసి ఇబ్బంది పెట్టడంతో పాటు కేసు కోర్టులో ఉండగా ఎందుకు ఇలా వర్మ మమ్ములను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కోర్టును ఆశ్రయించింది.
నల్లగొండ కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.వర్మ హైకోర్టుకు వెళ్లి స్టేను ఎత్తి వేయించాడు.
కొన్ని వారాల క్రితం హైకోర్టులో మర్డర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.అయితే సినిమాను విడుదల చేసేందుకు థియేటర్లు ఓపెన్ కాలేదు.ఇటీవలే థియేటర్లు పునః ప్రారంభం అయ్యాయి.దాంతో వర్మ తన మర్డర్ సినిమాను సెన్సార్ పూర్తి చేయించాడు.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఈ సినిమాలో అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆ తర్వత జరిగిన పరిణామాలను చాలా డ్రమస్టిక్ గా వర్మ తనదైన శైలిలో చూపించబోతున్నాడు.
ప్రేక్షకులు ఇన్ని రోజులు చూసింది ఒకటి.ఇంత కాలం అమృత గురించి అనుకున్నది ఒకటి అయితే ఈ సినిమాలో మొత్తం అభిప్రాయం మారిపోయేలా సినిమా ఉంటుందని అంటున్నారు.