ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో కొట్టుమిట్టాడుతూ వావి వరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.తాజాగా ముందుండి కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి ఓ కుటుంబ పెద్ద కామంతో కళ్లు మూసుకుపోయి తన పెద్ద కొడుకు కూతురి పై అత్యాచారానికి పాల్పడగా ఈ విషయం తన కన్న కొడుకు కి తెలియడంతో చివరికి కొడుకు ని హతమార్చిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే జమాద్ (పేరు మార్చాం) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నివాసముంటున్నాడు.అయితే తన కుటుంభం పోషణ నిమిత్తమై ఓ సెక్యూరిటీ ఏజెన్సీ లో పని చేస్తున్నాడు.
కాగా తాజాగా కుటుంబ సభ్యులు పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో ఇంట్లో అతడి పెద్ద కొడుకు భార్య ఒంటరిగా ఉంది. అప్పుడప్పుడే పని ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి జమాద్ ఒంటరిగా ఉన్నటువంటి తన కోడలిపై కన్నేశాడు.
ఈ క్రమంలో ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు.అనంతరం ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో బాధితురాలు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా తనలోతానే కుమిలి పోయింది. ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన బాధితురాలి భర్త ఏమైందని ఆమెను నిలదీయగా తన మామ చేసినటువంటి అఘాయిత్యం గురించి చెప్పుకుని కుమిలిపోయింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితురాలి భర్త తన తండ్రితో ఈ విషయం గురించి మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో జమాద్ తన కొడుకుని తుపాకీతో కాల్చి చంపాడు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికి బుల్లెట్ గాయాలు బలంగా తగలడంతో జమాద్ కొడుకు మృతి చెందాడు. దీంతో బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు జమాద్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.