ఎవరి వల్ల ఆగిపోయింది? చిరు సినిమా? ఇప్పుడా? ఒకప్పుడా? అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది.నిజమే.
చిరు సినిమా ఆగిపోయింది ఇప్పుడు కాదు ఒకప్పుడు.ఒకప్పుడే చిరు సినిమా ఆగిపోయింది.
అది కూడా అతిలోక సుందరి శ్రీదేవి వల్ల సినిమా ఆగిపోయింది.ఆగిపోయిన సినిమా ఏది అనుకుంటున్నారు? అక్కడికే వస్తున్న.సాధారణంగా ఏ ఆర్టిస్ట్ అయినా సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చే వరకు కష్టపడతారు.అణిగిమణిగి ఉంటారు.ఒక్కసారి అవకాశం రాగానే వారిలో ఉన్న ట్యాలెంట్ బయటపెట్టి వరుస అవకాశాలు కొట్టేస్తుంటారు.
అలా స్టార్ హీరోగా, స్టార్ యాక్టర్ గా, స్టార్ హీరోయిన్ గా మారిపోతుంటారు.
ఇక అలా మారిన వారు.కెరీర్ ప్రారంభంలో అణిగిమణిగి ఉన్న యాక్టర్స్ కాస్త చేతిలోకి పవర్ రాగానే మారిపోతారు.
ఏ సినిమా చేసిన నా అభిమానులు నన్ను ఆదరిస్తారు అని తెలిసిన వెంటనే కొమ్ములు వచ్చేస్తాయ్.నిర్మాతలను, దర్శకులను, వారితో కలిసి నటించే నటులను అందరిని ఇబ్బంది పెడుతారు.
అలానే శ్రీదేవి కూడా స్టార్ హీరోయిన్ అయినా సమయంలో.బాలీవుడ్, టాలీవుడ్ రెండు పరిశ్రమలను ఏలుతున్న సమయంలో ఆమె చేసిన పని వల్ల చిరంజీవికి కోపం వచ్చి రెండు సినిమాలు ఆపేశాడు.
ఆ సినిమాలే మధురాలదొంగ, కొండవీటి దొంగ.అదేంటి కొండవీటి దొంగ సినిమా రిలీజ్ అయ్యింది కదా.హిట్ కూడా అయ్యింది కదా అని మీకు అనుమానం వచ్చి ఉండచ్చు.కానీ నిజానికి కొండవీటి దొంగ రెండేళ్ల క్రితమే వాళ్ళ ఇద్దరికీ కలిపి అవకాశం వెళ్లగా.
శ్రీదేవి ఆ సినిమా కథలో మార్పులతో పాటు సినిమా పేరు కూడా మార్పు చెయ్యాలని పట్టుపట్టిందంట.కొండవీటి దొంగ కాదు.కొండవీటి రాణి, కొండవీటి రాజా అని ఉండాలి అని చెప్పడంతో చిరు ఆమెతో కలిసి నటించానని అప్పట్లో పట్టు పట్టాడట.దీంతో చివరికి విజయశాంతి, రాధతో కలిసి కొండవీటి దొంగ సినిమా తెర కెక్కించగా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.
ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఇద్దరు కలిసి నటించారు.