అమెరికాలో కరోనా మహమ్మారి రోజు రోజుకి వికృత రూపం దాల్చుతోంది.ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు.
కరోనా వచ్చిన మొదటి రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపించిందో అంతకు మించి కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఇప్పటివరకూ అమెరికాలో కరోనా కారణంగా ఆసుపత్రుల పాలైన వారి సంఖ్య సుమారు 1.15 కోట్లకు చేరుకోగా మృతి చెందిన వారి సంఖ్య మాత్రం 2.5 లక్షలు మార్క్ దాటేసింది.కేవలం నిన్న ఒక్కరోజులోనే 1.55 లక్షల కేసులు నమోదు కావడంతో కరోనా సెకండ్ వేవ్ పై అందరిలో ఆందోళన నెలకొంది.ఇదిలా ఉంటే
అమెరికాలో నిమిషానికి ఒక్కొక్కరు చనిపోతున్నారని సీఎన్ఎన్ వెల్లడించింది.రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవ్వడం గమనించిన పరిశీలకులు కరోనా మహమ్మారి గతంలో కంటే కూడా సెకండ్ వేవ్ లో తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉందని అంటున్నారు.జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుల లెక్కల ప్రకారం చూస్తే.కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 13.50 లక్షలుగా నమోదు కాగా అందులో సుమారు 2.50 లక్షలు మంది అమెరికన్స్ ఉన్నారని తెలిపింది…
అమెరికాలో కరోనా కేసుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది ఈ లెక్కలను బట్టి అర్ధమవుతోందని అంటున్నారు పరిశోధకులు.ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసులు రోజుకు 1200 నుంచీ 1300 వరకు నమోదు అవుతున్నాయని, కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో హాస్పటల్స్ లో చేరేవారి సంఖ్య పెరిగిపోతున్నాయని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితులకు కూడా ట్రంప్ కారణమని అధికారిక బదలాయింపుల పై ట్రంప్ చేస్తున్న ఆలస్యం వ్యాక్సిన్ త్వరగా రాకుండా చేస్తోందని ట్రంప్ సహకరించారని బిడెన్ వ్యాఖ్యానించారు.
.