తమిళం నుంచి వచ్చి తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్న కోలీవుడ్ హీరోయిన్లలో ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఒకరు.అయితే ఈ అమ్మడు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మొదటగా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర ఇబ్బందులు పడింది.
కానీ ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ అమ్మడుకి ఒక్కసారిగా మలుపు తిప్పింది.
అయితే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న తర్వాత శృతి హాసన్ గురించి అప్పట్లో సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వినిపించాయి. ఇందులో ముఖ్యంగా శృతి హాసన్ టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమా పరిశ్రమలకి చెందిన ముగ్గురు హీరోలతో ప్రేమాయణం నడిపిందని దీంతో ఈ విషయం కమల్ హాసన్ కి తెలియడంతో శృతిహాసన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.
కాగా ఆ మధ్య ప్రముఖ నటుడు మైఖేల్ కార్సల్ తో ప్రేమలో పడిందని, దీంతో తొందరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో పలు వార్తలు వినిపించాయి. కానీ ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి శృతి హాసన్ తన ప్రియుడు మైఖేల్ కార్సల్ తో బ్రేకప్ చెప్పి మళ్ళీ తన సినీ కెరీర్ పై దృష్టి సారించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న “క్రాక్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.