వైసీపీ మహిళా ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి వ్యవహారం కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది.ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఆమె చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే వస్తున్నాయి.
సొంత పార్టీ నాయకులు నుంచే ఆమెకు ఈ పరిస్థితి ఎదురవడం, వరుసగా వివాదాలు చుట్టుముట్టడం వంటి వ్యవహారాలతో శ్రీదేవి ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు.తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ శ్రీదేవి గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
తాడికొండ నియోజకవర్గం కి చెందిన శృంగారపాటి సందీప్ , చలివేంద్ర సురేష్ కొంతకాలంగా తనను ఇబ్బంది పెడుతూ, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బెదిరింపులకు దిగుతున్నారని , శ్రీదేవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వీరిద్దరూ గతంలో తాడికొండ నియోజకవర్గంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, మద్యం వ్యాపారం పేకాట క్లబ్ నిర్వహిస్తూ పట్టుబడ్డారు అని, ఈ వ్యవహారాల కారణంగా మండల పార్టీ నాయకులు వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని , ఇక అప్పటి నుంచి వీరిద్దరు తనపై కక్ష గట్టారు అని, పేర్కొన్నారు.
వారిద్దరిని తానే అధిష్టానం పెద్దలకు చెప్పి సస్పెండ్ చేయించానని వారు అనుమానిస్తున్నారని, అందుకే తనపై ఈ విధంగా కక్ష గట్టరు అని శ్రీదేవి వాపోతున్నారు. అంతేకాకుండా తన
గొంతు మార్పింగ్
చేసి తనను అవమానాలకు గురి చేస్తున్నారని, తాను ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో వారు తననే అనుసరిస్తున్నారని, వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ శ్రీదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే, ఈ ఇద్దరు గతంలో ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంలోని పనిచేసేవారిని, మొత్తం అన్ని వ్యవహారాలను చక్కబెట్టే వారిని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.కొంతకాలంగా శ్రీదేవి వివాదాస్పదం అవుతుండటం ముఖ్యంగా క్లబ్ నిర్వహణలో ఆమె పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం, ఈ వ్యవహారంపై అధిష్టానం పెద్దలు అక్షింతలు వేయడం వంటివి ఎన్నో వ్యవహారాలు చోటు చేసుకోవడం వంటి వాటితో శ్రీదేవి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ వ్యవహారంలో అధిష్టానం పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో ?
.