స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేసి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ లు సైతం వచ్చాయి.
తాజాగా ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షోకు హోస్ట్ గా చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.నిన్న సమంత “సామ్ జామ్” షో విశేషాలను పంచుకోవడానికి మీడియా సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ షోలో హోస్టింగ్ వెనుక ఉన్న రహస్యాల గురించి మీడియా ప్రతినిధులతో సమంత పంచుకున్నారు.మామ నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ చేయాలని చెప్పగానే భయమేసిందని అన్నారు.
తాను షోకు హోస్ట్ గా చేయాలనే నిర్ణయం మామయ్యదే అని తెలిపారు.అప్పటివరకు తనకు బిగ్ బాస్ షో గురించి తెలిసినా ఆ షోను చూడలేదని.
మూడు రోజులు అప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్స్ అన్నీ చూడాల్సి వచ్చిందని.షో హోస్ట్ చేయడానికి అంగీకరించాను కాబట్టి చాలా కష్టపడ్డానని పరోక్షంగా నరకం చూశాననే అర్థం వచ్చేలా సమంత చెప్పారు.
తనకు తెలుగు అంతగా రాకపోవడంతో బట్టీ పట్టానని ఆమె చెప్పుకొచ్చారు.హోస్టింగ్ సరిగ్గా చేయకపోతే మామ నమ్మకం కోల్పోతానని సరిగ్గా నిద్ర కూడా పోకుండా హోస్ట్ గా న్యాయం చేయాలని భావించానని అన్నారు.అయితే తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని షో పూర్తైన తర్వాత న్యాయం చేశానని అనిపించిందని సమంత అన్నారు.
బిగ్ బాస్ షో కోసం తన బెస్ట్ ఇచ్చానని.
షోలో అయితే చాలా సమయం నవ్వానని సమంత చెప్పారు.సమంత బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మూడు గంటల మారథాన్ ఎపిసోడ్ కోసం సమంత ఇంతలా కష్టపడిందా.? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.