సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్లుగా మారి తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ ఒకటి, రెండు హిట్ సినిమాలు పడితే హీరోయిన్స్ ఆలోచనలు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయనే విషయం గతంలో ఇలియానా, తాప్సి విషయంలో రుజువైంది.బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఈ భామలు సౌత్ సినిమాలపై, ఇక్కడి ప్రేక్షకులకి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
సౌత్ ప్రేక్షకులు కేవలం హీరోయిన్స్ ని గ్లామర్ క్వీన్స్ గానే చూస్తారని, వాళ్ళు అమ్మాయిల నడుములో కూడా అందాన్ని చూస్తారని కామెంట్స్ చేశారు.ఈ కామెంట్స్ వలన సోషల్ మీడియాలో సదరు హీరోయిన్లు విమర్శలకి కూడా గురయ్యారు.
బాలీవుడ్ లోకి వెళ్లి లైఫ్ ఇచ్చిన సౌత్ సినిమాల గురించి, సౌత్ ప్రేక్షకుల గురించి తక్కువ చేయడం హీరోయిన్లుకి ఫ్యాషన్ అయిపోఇంది అంటూ విమర్శలు వినిపించాయి.
ఇప్పుడు సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇలాగే సౌత్ ప్రేక్షకులపై నోరు పారేసుకుంది.
బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఫ్లాప్ తో దెబ్బ తిన్న పూజా హెగ్డేకి మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అవకాశాలు ఇచ్చింది.స్టార్ హీరోయిన్ ని చేసింది.ఈ రోజు పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న ప్రేక్షకుల నుంచి పూజా హెగ్డేకి వచ్చిన గుర్తింపు కారణం.కానీ ఈ విషయాన్ని మరిచిపోయి సౌత్ ప్రేక్షకులు అభిరుచికి కించపరిచే విధంగా మాట్లాడింది.
సౌత్ సినిమాలపై తన అభిప్రాయాన్ని చెబుతూ సౌత్ లో ప్రేక్షకులకి నడుము చూసే అలవాటు ఉందని, నడుము కనిపిస్తే వారు అదే మత్తులో ఉంటారని కామెంట్స్ చేసింది.అయితే ఈ కామెంట్స్ ఆమె క్యాజువల్ గా అన్నా కూడా కాస్తా సీరియస్ గా మారాయి.
దీంతో సోషల్ మీడియాలో పూజా హెగ్డేని సౌత్ ప్రేక్షకులు ట్రోల్ చేస్తున్నారు.పొగిడిన వాళ్ళే విమర్శలు చేస్తున్నారు.
మరి దీనిపై పూజా హెగ్డే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.