కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇద్దరు ముద్దుగుమ్మలు సంజన గర్లానీ మరియు రాగిణి ద్వివేది అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.గత రెండు నెలలుగా వీరిద్దరు కూడా జైల్లోనే ఉన్నారు.
ఈ రెండు నెలల కాలంలో వీరు ఏకంగా పది సార్లు బెయిల్ పిటీషన్ వేశారు.కాని ప్రతి సారి కోర్టు వీరికి మొండి చేయి ఇచ్చింది.
ప్రతి సారి కూడా డ్రగ్స్ కేసు విచారణ మద్యలో ఉండగా వీరికి బెయిల్ ఇవ్వడం వల్ల కేసు తప్పుదారి పట్టడం లేదంటే సాక్షులను ప్రభావితం చేయడం చేస్తారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ కోర్టు వీరికి బెయిల్ను నిరాకరించింది.తాజాగా మరోసారి కూడా కోర్టు వీరికి బెయిల్ను ఇచ్చేందుకు ఓకే చెప్పలేదు.
ప్రముఖ లాయర్ లు వీరిద్దరి తరపున వాదిస్తున్నప్పటికి ఇప్పటి వరకు బెయిల్ మాత్రం రాలేదు.
సెప్టెంబర్ 4న రాగిణి మరియు సెప్టెంబర్ 8న సంజనలు అరెస్ట్ అయ్యారు.
వారిద్దరు కూడా డ్రగ్స్ కేసుతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నట్లుగా నిరూపిం అయ్యింది.వారిద్దరితో పాటు పలువురు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.
ప్రతి ఒక్కరు విచారణ పూర్తి అయ్యే వరకు జైల్లో ఉండాల్సిందే అంటూ కోర్టు తాజా తీర్పులో పేర్కొంది.బాలీవుడ్ డ్రగ్స్ కేసు హీట్ మీద ఉన్న సమయంలోనే ఈ కేసు మొదలు అయ్యింది.
బాలీవుడ్ కేసు గురించి జనాలు మర్చి పోయారు.ఎవరు కూడా దాని గురించి మాట్లాడటం లేదు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి గత నెలలోనే బెయిల్ పై విడుదల అయ్యింది.కాని కన్నడ హీరోయిన్స్ అయిన వీరిద్దరు మాత్రం బయటకు వచ్చే దారి కనిపించడం లేదు.
ఈ నెల చివరి వరకు కూడా వారు జైల్లోనే ఉండాల్సి రావచ్చు అంటున్నారు.కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముకులు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.