వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్.రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ల సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ గా రకుల్ గుర్తింపు తెచ్చుకుంది.
స్పైడర్ సినిమా డిజాస్టర్ తరువాత రకుల్ కు అవకాశాలు తగ్గినా అడపాదడపా ఆఫర్లతో బిజీగానే ఉంది.
కొన్నిరోజుల క్రితం డ్రగ్స్ కేసు వల్ల వార్తల్లో నిలిచిన రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తోంది.
నిన్న ప్రపంచ వీగన్ దినోత్సవం కాగా ఈ సందర్భంగా రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులను మాత్రమే తీసుకుంటూ మాంసాహారానికి దూరంగా పాలు, పెరుగు కూడా తీసుకోకుండా ఉండేవాళ్లను వీగన్ అని అంటారు.
రకుల్ కూడా కొన్ని నెలల క్రితం నుంచి మాంసం, పాలు, పెరుగు తీసుకోకుండా వీగన్ గా మారింది.
రకుల్ మాంసం తినకపోవడం వల్ల తనకు అనేక ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరాయని చెప్పింది.
వీగన్ గా మారడం తాను తీసుకున్న ఉత్తమమైన నిర్ణయం అని పేర్కొంది.కొన్ని రోజుల పాటు మాంసాహారం తినాలనిపించలేదని.
ఆ తరువాత ధ్యానం చేసే సమయంలో తనలో ఊహించని మార్పులు రావడంతో తాను వీగన్ గా మారానే తప్ప అలా మారడానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవని తెలిపింది.
మాంసం తినకపోవడం శరీరం తేలికగా అనిపించిందని, నిగారింపు వచ్చిందని తాను వీగన్ గా మారినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.
అయితే కొందరు నెటిజన్లు మాత్రం మాంసం తినకుండా ఉండటం సులభమే అయినా పాలు, పెరుగు కూడా తినకుండా ఉండటం కష్టమని చెబుతున్నారు.