తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ “పూజిత పొన్నాడ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటగా పూజిత పొన్నాడ యంగ్ దర్శకుడు “హరి ప్రసాద్” దర్శకత్వం వహించిన “దర్శకుడు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ తర్వాత అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా రాణించలేక పోతోంది.
దీనికి తోడు ఇప్పటివరకు ఈ అమ్మడు నటించినటువంటి పాత్రలలో ఎక్కువశాతం గెస్ట్ అప్పియరెన్స్, కామియో అప్పియరెన్స్, రెండో హీరోయిన్ వంటివి కావడంతో ఇప్పటి వరకు ఈ అమ్మడికి సరైన హిట్ లేదు.
దీంతో నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి ఈ అమ్మడికి తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాలేదు.కాగా ప్రస్తుతం పూజిత పొన్నాడ పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ కొంతమేర గ్లామర్ షో చేస్తోంది.
కాగా ఇటీవలె “రన్” అనే తెలుగు వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
అయితే తెలుగులో పూజిత పొన్నాడ నటించినటువంటి రంగస్థలం, దర్శకుడు, 7, రాజు గాడు, బ్రాండ్ బాబు, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజిత పొన్నాడ తెలుగులో మహానటి చిత్ర ఫ్రేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “మిస్ ఇండియా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
మరి ఈ చిత్రమైనా ఈ అమ్మడికి మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి…
.