టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన సంగతి తెలిసిందే.ఆ తరువాత ఆంధ్రాపోరి చిత్రంతో హీరోగా మారాడు.
అయితే మెహబూబా చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరో, సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.దీంతో ఈసారి ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకుని హీరోగా రాణించాలని చూస్తున్నాడు.
దీనికోసం ‘రొమాంటిక్’ అనే పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు.
పూరీ జగన్నాథ్ కథ అందిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను అనిల్ పడూరి అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్డౌన్ కారణంగా అది కుదర్లేదు.దీంతో ఈ సినిమాను ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్తో చిత్ర యూనిట్ చర్చలు సాగుతున్నాయని, అవి ఓ కొలిక్కి రాగానే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే పలువురు స్టార్స్ తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో, ఇప్పుడు యంగ్ హీరో ఆకాష్ పూరీ చిత్రం కూడా అదే బాటలో రానుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ రొమాంటిక్ చిత్రంపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.మరి ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.