బాలీవుడ్ కల్ నాయక్ గా అందరిచేత గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంజయ్ దత్.సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి హీరోగా సంజయ్ దత్ యువకుడుగా ఉన్న సమయంలో డ్రగ్స్ కి బానిసై, అలాగే మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు.అలాగే ఓ కేసులో జైలు జీవితం కూడా అనుభవించాడు.ఒక సెలబ్రెటీగా ఉండి జీవితంలో ఒక సామాన్యుడి స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నటుడు.ఎన్ని విధాలుగా క్రింద పడిన సంజయ్ దత్ మరల తనని తాను ఆవిష్కరించుకొని కొత్త జీవితం స్టార్ట్ చేశాడు.వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.
అయితే ఉన్నపళంగా అతను క్యాన్సర్ బారిన పడ్డాడు.కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తే పరీక్షించుకోవడానికి వెళ్తే క్యాన్సర్ అని తేలింది.
దీంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిపోయారు.అక్కడ కొంత కాలం ఉండి ట్రీట్మెంట్ తీసుకొని క్యాన్సర్ ని జయించి తిరిగి వచ్చాడు.
ఈ సందర్భంగా సంజూ భాయ్ ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన విడుదల చేశారు.మీ అందరితో ఈ వార్త పంచుకుంటుంటే నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతోందని సంజయ్ దత్ కామెంట్ చేశారు.
కొన్ని వారాలుగా నేను, నా కుటుంబం కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాం.భరించేవాడికే బాధలు ఇస్తాడని కొందరు చెబుతుంటారు.అది నిజమే.ఈ రోజు నా పిల్లల బర్త్ డే.ఈ సందర్భంగా మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను.నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాను.
ఇదే నా పిల్లలకు నేను ఇవ్వగలిగే గొప్ప బహుమతి.మీ అందరి మద్దతు, ఆశీర్వాదం లేకపోతే ఇది జరిగేది కాదు.
ఇలాంటి కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీకి, అభిమానులకు రుణపడి ఉంటాను.కోకిలాబెన్ హాస్పిటల్ డాక్టర్ సేవంతి, ఆమె వైద్య బృందానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని సంజయ్ పేర్కొన్నారు.
క్యాన్సర్ ని జయించడంతో సంజయ్ దత్ ఇప్పుడు కేజీఎఫ్ 2లో అధీరా పాత్ర కోసం మరింత ఉత్సాహంగా రెడీ అవుతున్నాడు.