లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంది.ఎవరికి ఎక్కడి నుంచి ఎలా కరోనా సోకుతుంది అనే విషయం అర్ధం కానీ పరిస్థితి.
లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఎవరికి వారు తమ లైఫ్ మరలా స్టార్ట్ చేశారు.కరోనా ప్రభావం ఉన్నాకూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆరంభంలో కరోనాకి ప్రజలు భయపడినంతగా ఇప్పుడు భయపడటం లేదు.స్వీయ రక్షణ తీసుకుంటూ ప్రయాణాలు కూడా స్టార్ట్ చేశారు.
వారి రెగ్యులర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేశారు.ఇదిలా ఉంటే షూటింగ్ లు కూడా యధావిధిగా స్టార్ట్ అయిపోయాయి.
అయితే ఈ కరోనా ఎఫెక్ట్ అప్పుడప్పుడు సినిమా షూటింగ్ ల మీద పడుతుంది.షూటింగ్ లొకేషన్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఇక అంతే సంగతులు పేకప్ చెప్పేసి కొన్ని రోజులు అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి.
తాజాగా హిందీలో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే సమయంలో హీరోయిన్ కి కరోనా పాజిటివ్ రావడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.బాలీవుడ్ హీరోయిన్, తెలుగులో నానికి జోడీగా ఆహా కళ్యాణం సినిమాలో ఆడిపాడిన వాణీ కపూర్, ఆయుష్మాన్ ఖురానా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు.
షెడ్యూల్ కూడా చంఢీఘడ్ లో ఖరారు చేశారు.ఇంతలో హీరోయిన్ వాణీ కపూర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.దీంతో షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న డైరెక్టర్ అభిషేక్ కపూర్ టీం డైలామాలో పడ్డది.లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా వాణీకపూర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది.ఆమెతో కలిసి ఉన్న అభిషేక్, ఆయుష్మాన్ ఖురానా క్వారంటైన్ లో ఉన్నారు.
పరిస్థితి బట్టి వాణీ కపూర్ కి రికవరీ అయితే ఆమెతో కలిసి షూట్ చేయడం లేదంటే సోలో సన్నివేశాలతో స్టార్ట్ చేయడం చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది.