సినీ ఇండస్ట్రీలో ఒకరు హీరోయిన్ గా రానించాలంటే ఏది ఉన్న లేకున్నా రంగు మాత్రం ఉండాలి అంటారు.ఇది అన్ని చోట్లా కాదు ఎక్కడో కొన్ని ఇండస్ట్రీలో రంగు గురించి ప్రస్తావన తెస్తారు.
ఇక్కడ రంగే ప్రదానం.రంగు లేకుంటే అందమే లేదు అనుకుంటారు.
అలాంటి సినీ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ కూడా ఒకటి.టాలీవుడ్ లో ఎక్కడో ఒకరో ఇద్దరో రంగు తక్కువ వాళ్ళు కనిపిస్తారు.
వాళ్ళు కూడా తర్వాత తెల్లగా అవ్వడానికి సర్జరీలు, ఇంజెక్షన్లు ఉపయోగిస్తారు.
ఇక రంగు గురించి మాట్లాడితే కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రాజేష్ తను రంగు తక్కువ ఉన్నానని తెలుగు ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వనట్టు.
తెలుగు ఇండస్ట్రీలో రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు ఆమె బాధ చెప్పుకున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అదే బాధను చెప్పుకొచ్చింది.
ఆమె ఎవరో కాదు చాందిని.యూట్యూబ్ అంటే ఏంటో తెలియని సమయంలోనే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసి తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయింది ఈ భామ.
ఆతర్వాత సినిమాల్లోకి రావాలని ప్రయత్నించి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు రాలేదు.కానీ మన తెలుగు అమ్మాయి ఒక హీరోయిన్ అని, ఆమె ఇంత అందంగా ఉందని మాత్రం ఎంతోమంది గుర్తించారు.
ఇక అలాంటి ఈ భామ ప్రస్తుతం సుహాస్ పక్కన హీరోయిన్ గా ఓ సినిమాలో నటించింది.ఆ సినిమానే కలర్ ఫోటో.
ఇక ఈ సినిమా ఈ నెల 23న ఆహా యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ హీరోయిన్ తన చేదు అనుభవాలను చెప్పుకుంది.
ఆమె హీరోయిన్ అయ్యిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను ”నువ్వేమైనా పెద్ద కలర్ అనుకుంటున్నావా?” అంటూ హేళన చేసినట్టు.ఇండస్ట్రీలో రంగుకు ఇచ్చిన ప్రాధాన్యత మనిషికి ఇవ్వరు అని చెప్పుకొచ్చింది చాందిని.