అసలు ప్రపంచ ఆహార దినోత్సవం ఒకటి ఉందని చాలా మందికి తెలీదు.1945 అక్టోబర్ 16వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) స్థాపించబడింది.వారు ప్రపంచం లో ఆకలి బాధల పై చేస్తున్న సేవలకు చిహ్నంగా ప్రతి సంవత్సరం 16 అక్టోబర్ నాడు ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచంలో అందరికి తగిన పోషక ఆహారం అందించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం.130 దేశాలతో, 194 మెంబర్ స్టేట్స్ తో FAO పనిచేస్తుంది.రోజుకు కనీసం ఒక పూట ఆహారం లేక ఎంతో మంది మ్రుత్యువాత పడుతున్నారు.
మీరు ఎప్పుడైనా రోజుకు ఎంత ఆహారం వృధా చేస్తున్నారో అంచనా వేసుకున్నారా ?ప్రపంచంలో ఎంతో మంది ఆహారం వృధా చేస్తున్నారు.అలా వృధా చేసే ఆహారం ఎంతో మంది కడుపు నింపుతుంది.
ఇదే సమస్యపై FAO 1945 నుండి పనిచేస్తూనే ఉంది.ఫుడ్ వేస్ట్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
భారతదేశంలో ఆహారం వృధా చేయకూడదు అని ఒక నమ్మకం ఉంటుంది.కానీ ఒక సర్వే ప్రకారం భారతదేశం వృధా చేసే ఆహారం యునైటెడ్ కింగ్ డం మొత్తానికి సరిపోతుంది.
యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశం లో తయారయ్యే ఆహారం లో 40 శాతం వృధా అవుతుంది.సంవత్సరానికి సుమారు 21 మిలియన్ టన్నుల గోధుమ వృధాగా పోతుంది.
ఈ గణాంకాలు చూసాక కొందరైన ఆహారం వృధా చేయకుండా ఉంటారని మా నమ్మకం.