నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ కరోనా ప్రభావంతో ఓటీటీ ప్లాట్ఫాం అయిన అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాలని చూసిన నాని, సినిమా రిజల్ట్తో అప్సెట్ అయ్యాడు.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను పట్టాలెక్కించే క్రమంలో బిజీగా మారాడు ఈ హీరో.ఇప్పటికే టక్ జగదీష్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా, తన నెక్ట్స్ చిత్రాన్ని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమాకు ఆది నుండే అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోల్కతాలో జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా హైదరాబాద్లో కోల్కతా సెట్లో జరుపుకోవాల్సి వస్తుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుండి చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ వాకౌట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి నాగవంశీ వాకౌట్ చేసినట్లు, ఆయన స్థానంలో వెంకట్ బోయినపల్లి నిర్మాత బాధ్యతలు తీసుకున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు మరో ఇద్దరు బ్యూటీలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.