తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.ప్రతి రోజూ కూడా దాదాపుగా వెయ్యి నుండి రెండు వేల మధ్య పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా ఇదే విధంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,554 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది.
అలాగే , గడిచిన 24 గంటల్లో 7 మంది కరోనా బారిన పడి మరణించగా,ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 1,256 చేరింది.
ఇక కరోనా నుంచి తాజాగా 1,435 మంది డిశ్చార్జ్ కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,94,653 కు చేరింది.ప్రస్తుతం తెలంగాణలో 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో43,916 పరీక్షలు నిర్వహించగా, మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 37,46,963 కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.
గడిచిన 24 గంటల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 249, ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 95, జగిత్యాల్ 32, జనగాం 22, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులమ్మ గద్వాల్ 19, కామారెడ్డి 33, కరీంనగర్ 84, ఖమ్మం 88, కొమరం భీమ్ అసిఫాబాద్ 8, మహబూబ్ నగర్ 21, మహబూబాబాద్ 34, మంచిర్యాల్ 27, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్గిరి 118, ములుగు 21, నాగర్ కర్నూల్ 29, నల్గొండ 79, నారాయణ్పేట్ 12, నిర్మల్ 17, నిజామాబాద్ 29, పెద్దంపల్లి 29, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 128, సంగారెడ్డి 37, సిద్ధిపేట్ 49, సూర్యాపేట 42, వికారాబాద్ 27, వనపర్తి 28, వరంగల్ రూరల్ 30, వరంగల్ అర్బన్ 53, యాద్రాది భువనగిరి 24 కేసులు నమోదయ్యాయి.