తెలుగులో మొదలు పెట్టిన అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ప్రముఖ రియాల్టీ బిగ్ బాస్ షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇటీవలే మొదలైనటువంటి బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇంతకు ముందు మాదిరి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది.
అయితే ఇందుకు ముఖ్య కారణం గా ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు అని ఇప్పటికే కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.అయితే తాజాగా బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ రీడర్ దేవి నాగవల్లి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
అయితే ఇందులో భాగంగా తనకి గత రెండు సీజన్ల నుంచి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాలు వస్తున్నాయని కానీ తన ఉద్యోగ పనుల కారణంగా బిగ్ బాస్ షోలో పాల్గొనలేక పోయానని చెప్పుకొచ్చింది.కానీ ఈ సారి కరోనా కారణంగా తనకి రిపోర్టింగ్, న్యూస్ కవరింగ్ పనులు లేకపోవడంతో బిగ్ బాస్ షోలో పాల్గొన్నానని తెలిపింది.
అయితే ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి ఈ సారి బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్షకులకి పెద్దగా తెలియదని దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించాడు.అయితే ఈ ప్రశ్నకు దేవి నాగవల్లి స్పందిస్తూ తనతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తనకు కూడా తెలియదని ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత వారి గురించి తెలుసుకున్నానని తెలిపింది.
అంతేకాక ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు నిరాకరించడం వల్ల వీరికి అవకాశం వచ్చి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇక తాను బిగ్ బాస్ లో ఆడిన తీరుపై స్పందిస్తూ తాను చాలా జెన్యూన్ గానే ఆడానని కానీ తొందరగా ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలిపింది.
అంతేగాక తాను ఎలిమినేషన్స్ కి నామినేట్ అయినా వారంలో తనకు ఓట్లు బాగానే వచ్చాయని అయినప్పటికీ నిర్వాహకులు తనను ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మళ్ళీ దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి…
.