కాంగ్రెస్ కి గుడ్ బై ..నేడు బీజేపీలో చేరనున్న నటి ఖుష్బూ !

తమిళనాడు ప్రముఖ సీనియర్ నటి, కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్, యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్ సోమవారం ఢిల్లీలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీలో ఖుష్బూ చేరిక ఖాయమైందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 Congress Leader Kshubhu To Day Joining To Bharatiya Janata Party Kshubhu, Congr-TeluguStop.com

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఖుష్బూ, కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి మద్దతు తెలిపారు.దీనితో కాంగ్రెస్ అధిష్ఠానం ఖుష్బూ పై కొంచెం గుర్రుగా ఉంది.

అయితే, అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.ఇక , మరోవైపు 2014 నుంచి కాంగ్రెస్‌ లో కొనసాగుతున్న ఖుష్బూ గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే , బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు ఇప్పటివరకు ఖండిస్తూ వచ్చారు.ఈ తరుణంలోనే ఆమె ఢిల్లీ బాట పట్టడంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సోమవారం తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఎల్ మురుగన్ తో పాటు వెళ్లి, ఢిల్లీలో పార్టీ సెంట్రల్ టీమ్ ను ఖుష్బూ కలవనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.అయితే ఆదివారం చెన్నై ఎయిర్ పోర్టులో ఉన్న ఖుష్బూను.

బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా ఆమె మాట్లాడేందుకు ఇష్టపడలేదు.ఇక, మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ, మరో 8 నెలల్లో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూను బరిలోకి దింపాలని ఆలోచనలో ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube