సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషలలో సుమారు స్టార్ హీరోలు అందరితో ఈమె హీరోయిన్ గా చేసింది.
అమితాబచ్చన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ తో కూడా ఆడిపాడింది.తక్కువ సమయంలోనే సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా మారడంతో పాటు తెలుగులో సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
సుదీర్ఘ కాలం కెరియర్ కొనసాగించిన సౌందర్య తరువాత కాలంలో సినిమాలు తగ్గించి వివాహం చేసుకొని సెటిల్ అయ్యే సమయంలో విమాన ప్రమాదంలో మరణించింది.ఆమె మృతి చిత్ర పరిశ్రమకి తీరని లోటని చెప్పాలి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తూ ఉండటంతో ఇప్పుడు సౌందర్య బయోపిక్ గురించి కూడా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ బయోపిక్ కోసం ముందుగా కీర్తి సురేష్ సంప్రదించినట్లు టాక్ వచ్చింది.
ఆమె కూడా చేయడానికి ఒకే చెప్పేసింది అంటూ ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు తెరపైకి రౌడీ పిల్ల, క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి పేరు వచ్చింది.
ఇప్పటికే సౌందర్య బయోపిక్ కోసం సాయి పల్లవితో సంప్రదింపులు జరిగాయని, ఆమె కూడా చేయడానికి ఒకే చెప్పింది అని టాక్ వినిపిస్తుంది.ఓ ప్రముఖ మలయాళీ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్ ని తెరకెక్కించే పనిలో ఉందని తెలుస్తుంది.
త్వరలో ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.సాయి పల్లవి సౌందర్య పాత్రలో కనిపించబోతుంది అనే మాట ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది.