తెలుగు బుల్లి తెర పై బిగ్ బాస్ షో తాజాగా నాలుగో సీజన్ కొనసాగిస్తోంది.బిగ్ బాస్ ఆటలో ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అందరూ వారి నిజస్వరూపం బయటకు తీసుకువస్తూ బిగ్ బాస్ షో ను కాస్త ఇంట్రెస్టింగ్ వచ్చేలా నడుచుకుంటున్నారు.
ప్రేమలు, ఆటలు, కొట్లాటలు, టాస్క్ ఇలా ఒకటేంటి అన్ని అంశాలతో ప్రేక్షకుల్ని బిగ్ బాస్ సభ్యులు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు.నేటితో బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదలై 5 వారాలు పూర్తి చేసుకున్నట్లు అయింది.
ఇక ఈ రోజు సండే ఫన్ సండే అవడంతో నాగార్జున ఇంటి సభ్యులతో టాస్క్ కుల నేపథ్యంలో ప్రేక్షకులని అలరించబోతున్నారు బిగ్ బాస్ సభ్యులు.
ఇకపోతే ఇందుకు సంబంధించి తాజాగా స్టార్ మా యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ప్రోమో లో చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ ప్రోమోలో సోహెల్ పోకిరి డైలాగ్ చెప్పి, మహేష్ బాబు స్టైల్ లో పరుగు తీశాడు.అలాగే మెహబూబ్ రేసు గుర్రం డైలాగ్స్ చెప్పాడు.
ఇక ఆ తర్వాత కొందరు ఇంటి సభ్యులు ముఖాలని కొన్ని సినిమా పోస్టర్లలో హీరోల ముఖాలతో మార్ఫింగ్ చేసి అందరిని కడుపుబ్బ నవ్వించారు.
ఇక ఇందులో ఏం మాయ చేసావే చిత్రంలో సమంత ముఖాన్ని మోనాల్ ఫోటో గా మార్ఫింగ్ చేయగా పెదరాయుడు సినిమా లో మోహన్ బాబు ఫేస్ లాస్య తో, జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ముఖాన్ని అరియనాగా, అలాగే మాస్టర్ చిత్రంలో విజయ్ ముఖంతో రాజశేఖర్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పోస్టర్లను చూపించారు.ఇక చివరగా అభిజీత్ పోస్టర్ పై అవినాష్ ను నాగార్జున స్పందించమని అడగ్గా అభిజిత్ ప్లేస్ లో నేను ఉండాల్సింది అంటూ సమాధానం ఇచ్చాడు.దీనికిగాను ఆ అమ్మాయి నాది అనే డైలాగు చెప్పగా ఇది కరెక్ట్ చెప్పావ్ అంటూ నాగ్ అఖిల్ ను పేర్కొన్నాడు.
చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులతో ఎలాంటి హంగామా చేశాడో.