టాలీవుడ్ హీరోయిన్లలో రాశీఖన్నా రూటే సపరేటు.ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎనిమిదేళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా కెరీర్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఆమెకు అవకాశాలకు మాత్రం కొదువే లేదు.
లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన రాశీఖన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివిధ అంశాల గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాశీఖన్నా తాను ప్రశంసనైనా విమర్శనైనా సానుకూలంగానే తీసుకుంటానని.
నటనంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు.వృత్తి విషయంలో అందరితో పోటీ పడతానని సంఘర్షణను కోరుకోనని వెల్లడించారు.
ఏ పరిశ్రమలో అయినా సమస్యలు, సవాళ్లు ఉంటాయని సవాళ్లు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు.క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ తనకు ఇప్పటివరకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అన్నారు.
అయితే అలాంటి అనుభవాలను ఎదుర్కొన్న కొందరు తనతో ఆ విషయాలను ప్రస్తావించారని ఆ సమయంలో తనకు చాలా బాధగా అనిపించిందని వెల్లడించారు.సమాజంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందని రాశీఖన్నా అభిప్రాయపడ్డారు.
మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఏదో చేయాలని ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాననే బాధ ఉందని పేర్కొన్నారు.
కరోనా సమయంలో తనలో కూడా మార్పు వచ్చిందని.
ఇలాంటి సమయంలో తనకు కడుపు నిండా తిండి పెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నానని అన్నారు. లాక్ డౌన్ సమయంలో తమిళం, గిటార్ నేర్చుకున్నానని.
బంధుమిత్రులతో జూమ్ కాల్స్ లో కలిశానని తెలిపారు.లాక్ డౌన్ పూర్తైన తరువాత షూటింగ్ లో అడుగు పెడితే సొంత ఇంట్లో అడుగు పెట్టిన భావన కలిగిందని వెల్లడించారు.
తెలుగులో మూడు సినిమాల కథలు విన్నానని తమిళంలో మేధావి, అరన్మణై 3 అనే సినిమాలు చేస్తున్నానని చెప్పారు.