బాలీవుడ్ పరిశ్రమలో సినీ సెలబ్రిటీల వారసులకు ఉన్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన అనతి కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించాడు.
అంతేకాక సినీ బ్యాగ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నటన పరంగా తన ప్రతిభను నిరూపించుకుని తనకంటూ కొద్ది మంది ఆమె అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో అందుబాటులో ఉంటున్నాడు.
అయితే తాజాగా టైగర్ ష్రాఫ్ జిమ్ లో బాక్సింగ్ బ్లౌజ్ ధరించి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఓ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
దీంతో టైగర్ ష్రాఫ్ తన తదుపరి చిత్రంలో బాక్సింగ్ ప్లేయర్ గా కనిపించబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దికాలంలోనే దాదాపుగా 10 లక్షల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలను యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏమిటో అని. అయితే ఇప్పటివరకు టైగర్ ష్రాఫ్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని 26 మిలియన్ల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే టైగర్ ష్రాఫ్ హీరోగా నటించినటువంటి భాగీ 3 చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతోటైగర్ ష్రాఫ్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.
అయితే తాజాగా తెలుగులో మంచి హిట్ అయినటువంటి ఓ చిత్రాన్ని టైగర్ ష్రాఫ్ రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.