రామలక్ష్మణ యుద్దానికి రంగం సిద్ధం ..గెలుపెవరిది ?

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13 వ సీజన్ లో ఈ రోజు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతోంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి.

 Csk ,rcb, Ms Dhoni ,virat Kohli , Ipl, Ipl 2020-TeluguStop.com

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఢీ కొట్టబోతున్నారు.ఈ సీజన్ ‌లో టైటిల్ హాట్ ఫేవరేట్లు గా బరిలోకి దిగిన ఈ రెండు జట్లు అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాయి.

ఇటువంటి తరుణంలో నేడు జరగనున్న మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.కొహ్లీని ధోనీ ఓడగొడతాడా, లేదంటే ధోనిపై కొహ్లీయే పైచేయి సాధిస్తాడా.అని అందరిలో ఓ ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఆరో స్థానంలో ఉంది.టోర్నీలో 6 మ్యాచ్‌లాడిన ధోనీ సేన.4 మ్యాచ్‌లు ఓడిపోయి.కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.మూడింట గెలించి.రెండు మ్యాచుల్లో ఓటమి చెందింది.దీనితో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలక కానున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారు , ఎవరు ఎవరిపై ఆధిపత్యం సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube