యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13 వ సీజన్ లో ఈ రోజు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగబోతోంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఢీ కొట్టబోతున్నారు.ఈ సీజన్ లో టైటిల్ హాట్ ఫేవరేట్లు గా బరిలోకి దిగిన ఈ రెండు జట్లు అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నాయి.
ఇటువంటి తరుణంలో నేడు జరగనున్న మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.కొహ్లీని ధోనీ ఓడగొడతాడా, లేదంటే ధోనిపై కొహ్లీయే పైచేయి సాధిస్తాడా.అని అందరిలో ఓ ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఆరో స్థానంలో ఉంది.టోర్నీలో 6 మ్యాచ్లాడిన ధోనీ సేన.4 మ్యాచ్లు ఓడిపోయి.కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన కొహ్లీ సేన.మూడింట గెలించి.రెండు మ్యాచుల్లో ఓటమి చెందింది.దీనితో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలక కానున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారు , ఎవరు ఎవరిపై ఆధిపత్యం సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.
.